తాళ్లరేవు మండలం జార్జిపేటలో కోడి పందేలను వీక్షించేందుకు జనం భారీగా తరలివచ్చారు. తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరి, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లోని. పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కార్లలో తరలివచ్చారు. మూడు రోజుల పాటు గుండాటలు జరక్కుండా కోరంగి ఎస్సై శ్రీనివాసకుమార్ పర్యవేక్షణలో నియంత్రించారు. సోమవారం మధ్యాహ్నం నుంచి చిన్నబరుల వద్ద గుండాట, బాల్అటలు నిర్వహించారు. కాకినాడ ఇన్ఛార్జి డీఎస్పీ అప్పారావు ఆదేశాల మేరకు గ్రామీణ సీఐ శ్రీనివాసు ఆధ్వర్యంలో సుంకరపాలెంలో కోరంగి ఎస్సై గుండాట బోర్డులు, టెంట్లను తొలగించారు. చినవలసల, జి. వేమవరం, పటవల, గోప్పలంక, సుంకరపాలెం 1, 2 గ్రామాల్లో కోడిపందేలు జోరుగా జరిగాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa