ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఐవి రెడ్డి ఎంట్రీ పై విస్తృతంగా ప్రజల మధ్య చర్చ సాగుతుంది. ఆయన సన్నిహితులు కొద్దిగ రోజుల్లోనే ఐవి రెడ్డికి తిరిగి రాజకీయాలలో యాక్టివ్ కాబోతున్నారని అంటున్నారు. 2019 ఎన్నికల వరకు నియోజకవర్గ ఇన్చార్జిగా ఐవీ రెడ్డి కొనసాగారు. ఎన్నికల సమయంలో సీఎం జగన్ ప్రస్తుత ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబుకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు. నియోజకవర్గంలో ఓ సామాజిక వర్గానికి చెందిన నేతలు తమ సామాజిక వర్గానికి చెందిన నేతకే టికెట్ కేటాయించాలని ఈసారి పట్టు పడుతుండడంతో మరియు జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని ప్రజలు వేచి చూస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa