వాహనాలు నడిపేటప్పుడు ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని రాజమహేంద్రవరం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంపత్కుమార్ సూచించారు. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ఆర్ఎస్. పేటలో ఆయన వివిధ రకాల వాహనదారులకు, లారీ డ్రైవర్లు, యజమానులతో సమావేశం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా మృతి చెందుతున్నారని, ప్రతిఒక్కరూ రోడ్డు నియమాలు పాటించి వాహనాలు నడిపితే ప్రమాదాలు జరగవని చెప్పారు. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రమాదాలు జరిగిన వెంటనే తీసుకోవల్సిన ప్రథమ చికిత్సలను వివరించారు. అలాగే ఇన్సూరెన్స్ ఏవిధంగా పొందవచ్చో తెలిపారు. పరిమిత వేగంతో వాహనాలు నడిపితే ప్రమాదాలు నివారించవచ్చునని ఎంవీఐ సూచించారు. కార్యక్రమంలో ఏఎంవీఐ సబితా, బిక్కవోలు స్టేషన్ రైటర్ శివకృష్ణ పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఎంవీఐ సంపత్కుమార్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం గౌతమి నేత్రాలయం వారు గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేసి 150 మంది వాహనదారులు, లారీ డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య పరీక్షలు జరిపారు. శస్త్రచికిత్సలు అవసరమైన వారు తమ నేత్రాలయానికి వస్తే ఉచితంగా నిర్వహిస్తామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa