విశాఖ శ్రీ శారదాపీఠం వార్షిక మహోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పీఠం. ప్రాంగణంలో జనవరి 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. 27వ తేదీ శుక్రవారం ఉదయం వార్షిక మహోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. వార్షికోత్సవాలకు పీఠాధిపతులు స్వరూపానం దేంద్ర సరస్వతీ మహాస్వామి ఆధ్వర్యంలో ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి పర్యవేక్షణలో ఏర్పాట్లు చేపట్టారు. వందలాది మంది శాస్త్ర, ఆగమ, వేద పండితులు వీటిలో పాల్గొంటారు. సచ్చిదానంద విద్వత్ సభ పేరుతో నిర్వహించే శ్రోత, శాస్త్ర మహాసభల్లో ఉత్తమ పాండిత్యం ప్రదర్శించిన పండితులకు స్వర్ణ కంకణ ధారణ చేస్తారు.
తెలుగు రాష్ట్రాలు సస్యశ్యామలంగా ఉండాలని ఆకాంక్షిస్తూ చతుర్వేద హవనం నిర్వహించను న్నారు. ఐదు రోజులపాటు శత సహస్ర రాజశ్యామలా యాగం లక్ష మూల మంత్రాలతో చేపడుతున్నారు. జగద్గురు ఆది శంకరాచా ర్యుల వారి ప్రపంచ సార తంత్ర గ్రంధం ఆధారంగా మహాయాగం జరుగుతుంది. అలాగే సర్వజనుల హితాన్ని కాంక్షిస్తూ విశేష హెూమాలు జరుగుతాయి. వీటిలో శ్రీ లక్ష్మీ గణపతి హోమం, శ్రీ మేధా దక్షిణామూర్తి హెూమం, సుబ్రహ్మణ్య హెూమం, మన్యుసూక్త హోమం, రుద్రహోమం ఉంటాయి. 28వ తేదీన రధసప్తమి సందర్భంగా అరుణ పారాయణ, సూర్య నమస్కారములు నిర్వహిస్తారు.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తూ 30వ తేదీ సాయంత్రం రథోత్సవం, రాత్రి వల్లీ కళ్యాణం ఉంటాయి. రధోత్సవంలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున ఆదివాసీలు పీఠానికి తరలివస్తారు. ఆగమ శాస్త్రంపై అధ్యయనం జరగాలన్న లక్ష్యంతో ఈ వార్షికోత్సవాలలో ఆగమ సదస్సులను కూడా నిర్వహిస్తున్నామని పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామీ సోమవారం పీఠంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. 27 నుంచి మూడు రోజులపాటు చాత్తాద శ్రీ వైష్ణవాగమ సదస్సు, 30, 31 తేదీల్లో శైవగమ సదస్సు నిర్వహిస్తున్నట్లు వివరించారు. పీఠ ప్రాంగణంలోని దేవతామూర్తుల ఆలయాల్లో -నిత్యం విశేష అభిషేకాలు, రాజశ్యామలా అమ్మవారికి రాత్రి 7 గంటలకు మహా మంగళ హారతి ఉంటుందని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa