ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తండ్రి మద్యానికి బానిసవడంతో కూతురు ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 23, 2023, 11:40 AM

బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండలంలోని జికెఆర్‌పురం గ్రామానికి చెందిన ముద్దడ శ్రవంతి(15) తన తండ్రి మద్యానికి బానిసవడంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. గతంలో తన తండ్రి, తల్లీకి గొడవకాడంతో తల్లి కుమారుడుని తీసుకుని కన్నవారింటికి వెళ్లిపోగా శ్రవంతి మాత్రం తండ్రి వద్దనే ఉండిపోయింది.


అయినప్పటికీ తండ్రిలో ఎటువంటి మార్పూ రాకపోవడంతో ఈ నెల 18వ తేదీన తన ఇంట్లో చీమల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. వెంటనే ఆమెను బాడంగి పిహెచ్‌సికి అక్కడి నుంచి జిల్లా కేంద్రాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె ఆదివారం మృతి చెందింది. తల్లి ముద్దాడ పార్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ఉమా మహేశ్వరరావు కేసు నమోదు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa