జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లబ్ధిదారులను వెతికి మరీ సంక్షేమ పథకాలను అందజేస్తుందని పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు ఆమె సోమవారం సాయంత్రం పాతపట్నం మండలంలోని సీతారాం పల్లి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం అర్హులైన పేదలకు ప్రభుత్వ పథకాలను ఎలా కత్తిరించాలని ఆలోచిస్తుంటే. ప్రస్తుత ప్రభుత్వం ఎక్కడ లబ్ధిదారులు దొరుకుతారా అనే ఆలోచనతో వెతికి మరి పథకాలు అందిస్తుందని అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa