ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలానికి చెందిన స్థానిక కవి, తెలుగు అధ్యాపకులు గొట్టిముక్కుల నాసరయ్యకు మంగళవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పరసా పరిమిళ పౌండేషన్ వారి ఆధ్వర్యంలో పరిమిళించు స్వరాలు-గానలహరి ప్రోగ్రామ్ లో తెలుగు సాహిత్య రంగంలో విశేష కృషి గాను సన్మానం చేశామని తెలిపారు. ఈ సందర్భంగా నాసరయ్యను గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి ముని మనుమరాలు గిడుగు కాంతి కృష్ణ మరియు ఓంకర్ రాజ్ సినీ నటుడు చేతులమీదుగా హైదరాబాద్ లో ఘన సత్కారం పొందినారు.
ఈ సందర్భంగా నాసరయ్య మాట్లాడుతూ.. గిడుగు ముని మనుమరాలును కలువటం చాలా సంతోషకరంగా ఉందని, తెలుగు వ్యావహారిక బాష కొరకు గిడుగు ఎలలేని కృషి చేశారని తెలిపారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ, గిడుగు రామమూర్తి పౌండేషన్ స్థాపించి, ఆయన సేవలను విస్తరింప చేస్తున్న ఆయన ముని మనుమరాలు గిడుగు కాంతి కృష్ణకి అభినందనలు తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa