వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని కృష్ణ జిల్లా, నిడమానూరు టీడీపీ ఇన్చార్జి, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు అన్నారు. లోకేష్ చేపడుతున్న యువగళం పాదయాత్రకు సంఘీభావంగా విజయవాడ రూరల్ మండల తెలుగు యవత ఆధ్వర్యంలో నిడమానూరు నుంచి రామవరప్పాడు వరకూ సోమవారం పాదయాత్ర నిర్వహించారు. తొలుత దీన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ అర్జునుడు మాట్లాడుతూ..... జగన్రెడ్డి పాలనతో ప్రజలు విసిగిపోయారని, చంద్రబాబు పాలన కోసం ఎదురుచూస్తున్నారన్నారు. రాష్ట్ర భవిష్యత్ను అధోగతి పాలు చేసిన ఘనత జగన్రెడ్డికే దక్కుతుందన్నారు. ఇచ్చిన హామీలను విస్మరించి నవరత్నాల పేరుతో మోసం చేశారని మండిపడ్డారు. రావణుడి పాలన పోగొట్టేందుకు ప్రజల్లో ఛైతన్యం తెచ్చేందుకు యువనేత నారా లోకేష్ పాదయాత్ర చేపట్టారన్నారు. నిడమానూరు, ఎనికేపాడు, ప్రసాదంపాడు, రామవరప్పాడు గ్రామాల్లో కేకులు కట్ చేశారు. నేతలు గొడ్డళ్ల చిన రామారావు, కోనేరు సందీప్, బండి వెంకట్రావు, కోనేరు శివరామకృష్ణ, చాగటిపాటి వెంకటకృష్ణ, కోనేరు చినబాబు, గూడవల్లి నర్సయ్య, బొప్పన హరికృష్ణ, గుజ్జర్లపూడి బాబూరావు, పోకా కిరణ్, నెక్కంటి శ్రీదేవి, నభిగాని కొండ, అద్దెపల్లి సాంబులు, బొమ్మసాని అరుణ, కాకాని శివరాం పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa