లైఫ్లో బతికినా, చచ్చినా సింహంలాగే ఉంటానని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. రాసుకోండి.. నెల్లూరు నగరం నుంచే పోటీ చేస్తున్నాను అని ఆయన అన్నారు. టీ షాపుల దగ్గర మాట్లాడే అందరికీ కూడా చెప్తున్నా.. అనిల్ అనేవాడు నెల్లూరు నగరం నుంచే పోటీ చేస్తాడని అన్నారు. అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గీసిన గీత దాటడు అని మళ్లీ చెప్తున్నాను అన్నారు. రాష్ట్రంలో అనిల్ కుమార్ యాదవ్ అనే వాడు ఎవరికైనా తల వంచుతాడు అని అంటే అది కేవలం ఒక్క జగన్మోహన్ రెడ్డికి ముందు తప్పితే ఇంకొకరి ముందు తల వంచే ప్రసక్తే లేదన్నారు.
కొందరు శునకానందం కొన్ని రోజులు పొందండని.. ప్రశాంతంగా నిద్రపోండి అని చురకలంటించారు. అనిల్కు టికెట్ రాదనుకోండి.. 2024 పోటీ చేసిన తర్వాత వాళ్లంతా నిద్రలేని రాత్రులు గడపాలన్నారు. ఈ నాలుగు రోజులు ప్రశాంతంగా నిద్రపోండి.. 2024లో కానీ ఎప్పుడైనా తానే నెల్లూరు నగరం నుంచి పోటీ చేస్తాను అని ప్రకటించారు. జీవితంలో దిగజారి బతికినా ఓడిపోతామన్నారు.
ఈ రాష్ట్రంలో ఒకరికే తల దించుతా.. అది వైఎస్ జగన్ మాతమ్రే అన్నారు. ఇంకెవరికి తల వంచేది లేదని.. తన తప్పు లేకుండా తల వంచేది లేదన్నారు. రాజకీయాలు ఉంటాయి.. పోతాయి.. బతికినా, చచ్చినా సింహంలాగే ఉంటానన్నారు. ఎంతమంది తనకు వ్యతిరేకంగా వచ్చిన పర్లేదని.. తాను తట్టుకుంటానన్నారు. తనను ఇబ్బందిపెడుతున్నారని కాళ్లు మొక్కే పని ఉండదన్నారు. ఆ శునకానందం పొందేవారికి ఇదే తన సమాధానం అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa