అక్కినేని నాగేశ్వరరావును ఉద్దేశించి హిందూపురం ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మంత్రి రోజా తీవ్రంగా ఖండించారు. బాలయ్య చేసిన వ్యాఖ్యలు సరికాదని.. ఎన్టీఆర్ను విమర్శిస్తే ఆయన ఊరుకుంటారా అని ప్రశ్నించారు. బాలకృష్ణ అక్కినేనిని అవమానించడం తప్పని.. ఎన్టీఆర్ని అవమానిస్తే వీళ్ళు ఎంత బాధ పడతారో.. అలాగే అక్కినేని అభిమానులు కూడా బాధపడతారన్నారు. ఆ విషయంపై ఇప్పటి వరకూ బాలకృష్ణ తప్పును సరిదిద్దుకోలేదని.. ఎప్పుడూ సరిదిద్దుకోరన్నారు.
యువగళం కాదు టిడిపికి సర్వమంగళం అంటూ నారా లోకేష్ పాదయాత్రను ఎద్దేవా చేశారు రోజా. అంచెలంచెలుగా టీడీపీ పడిపోతూ వస్తోందని.. ముందు పార్టీని ప్రక్షాళన చేయాలన్నారు. ముఖ్యమంత్రి జగన్ను తిట్టడానికే లోకేష్ పాదయాత్ర చేస్తున్నారని.. టీడీపీ నేతలు ఎంతతిడితే అంత మైలేజ్ జగన్కు రెట్టింపుగా వస్తుందన్నారు. లోకేష్ వార్డు మెంబర్కు ఎక్కువ ఎమ్మెల్యేకు చాలా తక్కువని ఎద్దేవా చేశారు. ఒక చోట ఓడిపోయిన లోకేష్, రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ను చూసి వైఎస్సార్సీపీ కార్యకర్తలు భయపడరన్నారు.
జనసేన పార్టీనా, చంద్రసేనపార్టీనా, కన్ఫూజన్ పార్టీనా అంటూ సెటైర్లు పేల్చారు. పవన్ కళ్యాణ్ రోజుకొక మాట మాట్లాడుతున్నారని.. ప్యాకేజీ కోసమే పాకులాడుతున్నారే తప్ప.. ముఖ్యమంత్రి అవ్వాలన్న ఆలోచన పవన్ కళ్యాణ్కు లేదన్నారు. 26 జిల్లాలకు జిల్లా అధ్యక్షులను పెట్టుకోలేని పార్టీ జనసేనపార్టీ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ తెలంగాణాలో పోటీ చేయడాన్ని స్వాగతిస్తున్నానని.. ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ తన పని తాను చేస్తోందని.. ఎంపీ అవినాష్ రెడ్డి ఏ తప్పు చేయలేదని తాను నమ్ముతున్నట్లు చెప్పారు. సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి హాజరవుతారన్నారు.
వివేకానంద రెడ్డి హత్య చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు జరిగిందని.. అప్పటి ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వైఫల్యం హత్యలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎఫ్ఐఆర్లో అవినాష్ రెడ్డి పేరు చేర్చలేదని.. ఇప్పుడు సీబీఐని తప్పుదారి పట్టిస్తూ హడావిడి చేస్తున్నారని విమర్శించారు. తిరుపతి జిల్లాలో సినీ పరిశ్రమకు తమిళ సినీ పెద్దలు భూమి కోరినట్లు తెలిసిందని.. అవసరమైతే సీఎం జగన్తో మాట్లాడి వాళ్లకి భూమి ఇప్పిస్తాని చెప్పారు రోజా.
బాలయ్య వీరసింహారెడ్డి సక్సెస్మీట్లో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అక్కినేని తొక్కినేేని, ఆ రంగారావు, ఈ రంగారావు అంటూ చేసిన కామెంట్స్పై అక్కినేని వారసులు నాగచైతన్య, అఖిల్ స్పందించగా.. అభిమానులు మండిపడుతున్నారు. అలాగే కాపునాడు సైతం బాలయ్యపై ఆగ్రహం వ్యక్తం చేసింది బుధవారం లోపు క్షమాపణలు చెప్పాలని డెడ్ లైన్ విధించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa