అభివృద్ధి వికేంద్రీకరణ, మూడు రాజధానుల ఏర్పాటే తమ విధానమని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సన్నాసి మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ గట్టిగా మాట్లాడినంత మాత్రాన ఎవరూ భయపడిపోరన్నారు. ఆయన మాటలను వింటుంటే .. రాజకీయాలంటే విరక్తి కలుగుతోందన్నారు. రాజ్యాంగానికి.. చట్టానికి లోబడి రాష్ట్రంలో ఎవరైనా ఎక్కడికైనా తిరగవచ్చని చెప్పారు. ఆయన్ను రాష్ట్రంలో తిరగకుండా ఎవరూ అడ్డుకోవడం లేదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa