తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్ర వైసీపీ నాయకుల్లో వణుకు పుట్టిస్తుందని శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. సారవకేట మండలం గొర్రిబంద పంచాయతీ బురుజువాడ గ్రామంలో గురువారం సాయంత్రం నిర్వహించిన ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఇంటింటా ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.... పాదయాత్రలో లోకేశ్కు ప్రజల నుంచి వస్తున్న ఆదరాభిమానాలను చూసి వైసీపీ నేతలు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. జగన్రెడ్డి రాక్షస పాలన ప్రజలకు అర్ధమైందని, రానున్న ఎన్నికల్లో వైసీపీకి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నా రు. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పనిచేయాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కత్తిరి వెంకటరమణ, నాయకులు ధర్మాన తేజకుమార్, సురవరపు తిరుపతిరావు, సాధు చిన్నికృష్ణంనాయుడు, పట్ట ఉమారావు, డి.జయరాం, పొదిలాపు వేణుగోపాలరావు, బైరి భాస్కరరావు, బగ్గు గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa