వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ సతీమణి స్వర్ణకుమారి అనారోగ్యంతో మృతి చెందారు. విజయవాడ గొల్లపూడిలోని తలశిల రఘురామ్ నివాసానికి వెళ్లిన సీఎం వైఎస్ జగన్, భారతి దంపతులు.. స్వర్ణకుమారి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఎమ్మెల్సీ కుటుంబాన్ని పరామర్శించారు. సీఎం జగన్తోపాటు వైఎస్సార్సీపీ నాయకులు రఘురామ్ కుటుంబాన్ని పరామర్శించారు.
‘‘నా ఆత్మీయుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి, తలశిల రఘురాం సతీమణి తలశిల స్వర్ణ కుమారి అకాల మరణం బాధాకరం. రఘురామ్కు, తన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాన’’ని సీఎం జగన్ ట్వీట్ చేశారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి రఘురామ్ ఆయన వెంట నడుస్తున్నారు. జగన్ చేపట్టిన పాదయాత్రకు ఆయన కోఆర్డినేటర్గా వ్యవహరించారు. వైఎస్సార్సీపీ అధినేత పాదయాత్రకు రూట్ మ్యాప్ రూపొందించడంతోపాటు.. ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి, జగన్ సీఎం అయ్యాక.. ముఖ్యమంత్రి ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్గా తలశిల వ్యవహరిస్తున్నారు. తనకు ఇష్టుడైన రఘురామ్కు జగన్ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలో తలశిల రఘరామ్కు మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం కూడా జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa