ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డియర్ అమర్‌నాథ్.. నువ్వు రాజకీయాల్లో బచ్చావి...హరిరామ జోగయ్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 05, 2023, 06:22 PM

తాజాగా మంత్రి గుడివాడ అమర్నాథ్‌పై కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు మంత్రి అమర్నాథ్‌కు ఆదివారం హరిరామ జోగయ్య లేఖ రాశారు. ‘‘డియర్ అమర్‌నాథ్.. నువ్వు రాజకీయాల్లో బచ్చావి.. పైకి రావాల్సిన వాడివి.. సాధారణ మంత్రి పదవికి అమ్ముడు పోయి కాపుల భవిష్యత్తుని పడు చేయకు. అనవసరంగా పవన్ కళ్యాణ్‌పై బురద చల్లడానికి ప్రయత్నం చేయకు. నీ భవిష్యత్ కోరి చెబుతున్నా.’’ అని హరిరామజోగయ్య పేర్కొన్నారు.


జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై ఒంటి కాలిపై లేచే రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌పై జనసైనికులు ఎదురుదాడి ప్రారంభించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌ను ‘కాపు’ కులంతో ముడిపెడుతూ అమర్నాథ్ ఓ రేంజ్‌లో విమర్శలు చేస్తుంటారు. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు పవన్ కళ్యాణ్ కాపులను తాకట్టుపెడుతున్నారని దుయ్యబడుతుంటారు. ఈ క్రమంలో మంత్రి అమర్నాథ్‌పై జనసేన నాయకులు, కార్యకర్తలు, కాపు సంఘం నేతలు విరుచుకుపడుతున్నారు.


ఇదిలావుంటే చంద్రబాబు, లోకేష్ భుజాలను మోయడానికి పవన్ సిద్ధమయ్యారని గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. కాపులను తాకట్టు పెట్టేందుకు పవన్ సిద్ధమయ్యారన్నారు. వేపగుంట కాపు సామాజిక భవన ప్రారంభోత్సవ సభలో పవన్‌పై అమర్నాథ్ తీవ్ర కామెంట్స్ చేశారు. మంత్రి కామెంట్స్‌పై జనసేన కౌంటర్ అటాక్ చేసింది. కాపు భవన్లో సౌకర్యాలపై నిరసనలు వ్యక్తం చేసింది. మరోవైపు జనసేన నేతలు కూడా మంత్రి అమర్నాథ్‌పై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంత్రి అమర్నాథ్ బానిసగా మారారని జనసేన రాష్ట్ర నాయకుడు తమ్మిరెడ్డి శివశంకర్ దుయ్యబట్టారు. పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు మానుకోకపోతే ఇంత కంటే తీవ్రంగా స్పందిస్తామని వార్నింగ్ ఇచ్చారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa