కొండ చిలువ జనవాసంలోకి వచ్చింది...ఎక్కంగా రోడ్డెక్కింది. విజయవాడలో ఓ కొండచిలువ కలకలం రేపింది. ఎలా వచ్చిందో తెలియదు కానీ నడిరోడ్డు మీదకు చేరుకున్న కొండచిలువ.. అటుగా వెళ్తున్న వారిని భయాందోళనలకు గురిచేసింది. ఇంద్రకీలాద్రి కింద ఉన్న హెడ్ వాటర్ వర్క్స్ ఎదురుగా ఉండే రోడ్డుపైకి కొండచిలువ వచ్చి చేరింది. రోడ్డుపక్కనున్న ఫుట్ పాత్ మీద రిలాక్స్ అవుతున్న కొండ చిలువను చూసి అటుగా వెళ్తున్న స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. మరికొంతమంది వాహనదారులు పైథాన్ను తమ ఫోన్లలో బంధించేందుకు పోటీలు పడ్డారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది
అయితే కొండచిలువ నగరంలోకి ఎలా వచ్చిందని స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గతంలో కూడా విజయవాడలో కొండచిలువలు కనిపించిన ఘటనలు ఉన్నాయి. అటవీ ప్రాంతం నుంచి తప్పించుకుని నగరంలోకి వచ్చి ఉండొచ్చని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. రోడ్డుపైకి కొండచిలువ చేరిన విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు అటవీశాఖ అధికారులకు చేరవేశారు. .
విజయవాడలో రోడ్డుపై కొండచిలువ
అంతేకాదు గతంలో కూడా విజయవాడలో కొండచిలువ కనిపించింది. ప్రసాదంపాడు కార్మిక నగర్ కట్టపై కొండచిలువ ప్రత్యక్షమైంది. స్థానికులు భయంతో పరుగులు తీశారు.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వారు ఫారెస్ట్ అధికారులకు చెప్పారు. అటవీశాఖ సిబ్బంది కొండ చిలువను జాగ్రత్తగా పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలి పెట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa