ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాబుతో పవన్ ఎలా పొత్తు పెట్టుకుంటారు,,,హరిరామ జోగయ్యకు మంత్రి అమర్ మరో లేఖ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 07, 2023, 08:34 PM

చంద్రబాబుతో పవన్ ఎలా పొత్తు పెట్టుకుంటారు అంటూ హరిరామ జోగయ్యకు మంత్రి అమర్ మరో లేఖ రాశారు. ఇదిలావుంటే చేగొండి హరిరామ జోగయ్య వర్సెస్ గుడివాడ అమర్. ఇద్దరు నేతల మధ్య లేఖల యుద్ధం మరింత ముదురుతోంది. రెండు రోజుల క్రితం కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ మంత్రి హరిరామ జోగయ్య మంత్రి అమర్‌కు లేఖ పంపండంతో ఈ వార్ మొదలైంది. హరిరామ జోగయ్య లేఖలో.. ‘Dear అమర్‌నాథ్.. నువ్వు రాజకీయాల్లో బచ్చావి.. పైకి రావాల్సిన వాడివి.. సాధారణ మంత్రి పదవికి అమ్ముడు పోయి కాపుల భవిష్యత్తుని పాడు చేయకు. అనవసరంగా పవన్ కళ్యాణ్‌పై బురద చల్లడానికి ప్రయత్నం చేయకు. నీ భవిష్యత్ కోరి చెబుతున్నా.’అంటూ లేఖలో ప్రస్తావించారు.


హరిరామ జోగయ్య లేఖకు మంత్రి అమర్ ఘాటుగా స్పందించారు. 'తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుతో జతకడుతున్న పవన్ కళ్యాణ్‌కు పంపబోయిన లేఖను నాకు పంపారా?. ఆయురారోగ్యాలతో పాటు మానసిక దృఢత్వంతో ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను' అంటూ మరో లేఖ మంత్రి అమర్ పంపించారు. మంత్రి అమర్ అక్కడితో ఆగలేదు.. తాజగా మరో లేఖ పంపించారు. ‘గౌరవనీయులైన హరిరామ జోగయ్య గారికి.. వంగవీటి మోహన రంగా గారిని చంపించినది చంద్రబాబు నాయుడే అని మీరు పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. అలాంటి చంద్రబాబుతో పొత్తులకు సిద్ధమైన పవన్ కళ్యాణ్‌ను మీరు సమర్థిస్తారా.. స్పష్టం చేయగలరు’అంటూ రెండో లేఖ రాశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa