ఎస్సీ వర్గీకరణ చెయ్యడంలో జాప్యం చేస్తున్న బిజెపి ప్రభుత్వం పై నిరసనగా మందకృష్ణ మాది ఆదేశాల మేరకు ఫిబ్రవరి 13వ తారీఖున విజయవాడ టు హైదరాబాద్ జాతీయ రహదారి దిగ్బంధనం చేయాలని బుధవారం ఉమ్మడి కడప జిల్లాల కన్వీనర్ వెలగచర్ల శివయ్య మాదిగ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఉమ్మడి కడప జిల్లాలో 51 మండలాల నుంచి ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి, విహె. చ్. పి. ఎస్, ఎం. ఎం. ఎస్, యంయస్ఎఫ్, ఎంఈఎఫ్ అనుబంధ సంఘాల నాయకులు అత్యధిక సంఖ్యలో ఈ నిరసన పాల్గొని మనకు కేటాయించినటువంటి దనబండ విజయవాడ జాతీయ రహదారి ని దిగ్బంధనం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ సమావేశంలో కడప జిల్లా ఎమ్మార్పీఎస్ కన్వీనర్ మాణికింది వెంకటేష్ మాదిగ, ఎంఎస్పి కడపజిల్లా నాయకులు మతయ్య మాదిగ, గంగరాజు మాదిగ, నవీన్ మాదిగ, గురు మాదిగ, రవీంద్ర మాదిగ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa