ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్ర విభజన చట్టం ప్రకారం జరిగింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 09, 2023, 03:24 PM

 అమరావతే రాజధాని  అంటూ పార్లమెంట్  సాక్షిగా కేంద్రం కుండబద్దలు కొట్టడం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి   ఆశలకు నీళ్లు చల్లినట్లైందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు  అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.... ముఖ్యమంత్రి విశాఖకు వెళ్తే వెళ్లొచ్చన్నారు. అవసరం లేని వాడు కోటలో ఉన్న పేటలో ఉన్న ఒకటే అంటూ వ్యాఖ్యలు చేశారు. నిన్న పార్లమెంట్ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చిందని తెలిపారు. రాజధాని అధికారం రాష్ట్రాలదని అడిగారన్నారు. అమరావతిని కేంద్రం రాజధానిగా అంగీకరించి 2500 కోట్లు గ్రాంట్ ఇచ్చిందని గుర్తుచేశారు. రాజ్‌భవన్, హైకోర్టు, సెక్రటేరియట్‌కు నిధులు ఇచ్చారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులు అంటే హైకోర్టు కేసును కొట్టేసిందని తెలిపారు. ప్రశ్న అడిగిన సాయిరెడ్డికి ఎంపీ అభినందనలు తెలిపారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం జరిగిందని... మళ్ళీ రాజధాని చేయాలంటే పార్లమెంట్‌లో చట్టం చేయాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa