హొళగుంద మండలం లోని హర హర మహాదేవ శంభో శివశంకర నినాదంతో మారుమోగిన ఎస్సీ కాలనీ పాదయాత్రికులకు అన్న సంతర్పణ చేసిన జై భీమ్ రాయలసీమ ఇంచార్జ్ దుర్గాప్రసాద్ ఎం ఆర్ పి ఎస్ మండల అధ్యక్షుడు వెంకటేష్ మాదిగ హర హర మహాదేవ శంభో శివశంకర పార్వతి పరమేశ్వరులకు జై నినాదాలతో హెుళగుంద ఎస్సీ కాలనీ శుక్రవారం ఉదయం మారుమోగింది. ఎస్సీ కాలనీకి చెందిన సుమారు 70 మంది భక్తులు పంచగండిగే బ్రదర్స్ ఆధ్వర్యంలో శ్రీశైలానికి కాలినడకన బయలు దేరారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా శైవ క్షేత్రం శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించుకునే శివ భక్తులు ఈ సంవత్సరం కూడా బయలుదేరి వెళ్లారు. భక్తుల శ్రీశైలంపాదయాత్ర సందర్భంగా ఎం ఆర్ పి ఎస్ మండల అధ్యక్షుడు వెంకటేష్ మాదిగ పాదయాత్రకు బయలుదేరిన వారికి స్థానిక హులిగమ్మవ దేవి దేవాలయంలో అన్న సంతర్ప ణ చేశారు. ఈ సందర్భంగా పాదాయత్రికులు మాట్లా డుతూ ప్రతి సంవత్సరం శివరాత్రికి ఇక్కడ నుండి శ్రీశైలానికి కాలినడకన వెళ్లడం ఆనవాయితీగా వస్తుంది. అని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచగుండ గ సోదరులు తప్పేట ఈరేష్, సినిమా మంగన్న, శీను, మహేష్, గుడిసె నాగరాజు, ఈశ్వర్, హనుమంతు, రవి, ప్రసాద్, దురుగన్న, అంజని, తిమ్మ, మల్లికార్జున, తిప్పమ్మ, లక్ష్మి, ఈరమ్మ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa