వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గుడివాడ నియోజకవర్గ టికెట్ తనదేనని, గెలిచేది కూడా తానేనని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యాక ఆయన విలేకరులతో మాట్లాడారు. 10 రోజులుగా చంద్రబాబును కలవాలని అనుకున్నా, తనపై పెట్టిన అక్రమ కేసులు, అరెస్టు కారణంగా కలవడం కుదరలేదన్నారు. నియోజకవర్గంలో పరిస్థితులను చంద్రబాబుకు వివరిం చానన్నారు. గుడివాడలో నానీని ఢీకొట్టి టీడీపీ జెండాను తిరిగి రెపరెపలాడించే వ్యక్తిని తానేనన్నారు చంద్రబాబు ఇచ్చిన భరోసాతోనే తాను ముందుకు పోతున్నానన్నారు. తనకు టికెట్ ఇవ్వడంపై ఏ సందేహమూ లేదన్నారు. నియోజకవర్గ ఇన్చార్జ్గా తన శక్తి మేర పని చేస్తున్నానన్నారు. నియోజకవర్గంలో పార్టీలో గ్రూపులు లేవని, పార్టీ ఆదేశాల మేరకే నాయకులు, కార్యకర్తలు పని చేస్తున్నారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్రెడ్డి, కొడాలి నానీలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. నియోజకవర్గంలో పార్టీని ఏకతాటిపై నిలిపి నానీని ఓడిస్తానని రావి స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa