ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. అమరావతే ఏపీ రాజధానిగా కొనసాగుతుందని స్పష్టమైన ప్రకటన చేయండని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఏపీ రాజధాని అమరావతి అని కేంద్రం పార్లమెంట్ సాక్షిగా పలుమార్లు స్పష్టం చేసిందన్నారు. నాడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉండగా అమరావతిని రాజధానిగా అంగీకరించారని గుర్తుచేశారు. ఏపీ హైకోర్టు కూడా అమరావతినే రాజధానిగా అభివృద్ధి చేయాలని తీర్పునిచ్చిందన్నారు. 3 రాజధానుల బిల్లు రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుందని లేఖలో పేర్కొన్నారు. ప్రతి నెల ఒకటో తేదీకి ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని ప్రభుత్వం 3 రాజధానులంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరని విమర్శించారు. అమరావతి రాజధాని విషయంలో ఇకనైనా వివాదాలకు స్వస్తి పలకండని ఆయన సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa