చావు ఎప్పుడు వస్తుందో ఎవరు ఊహించని పరిణామం. తాజాగా ఓ వివాహ వేడుకలో విషాదం చోటుచేసుకుంది. ఏడడుగులు వేస్తుండగానే వరుడు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. అత్యంత విషాదకర ఈ ఘటన ఉత్తరాఖండ్లో జరిగింది. వివరాల్లోకి వెళితే రాణీకేఠ్లోని నందపుర్ కఠ్గరియాకు చెందిన సమీర్ ఉపాధ్యాయ్ (30) అనే యువకుడి డెంటిస్ట్గా పనిచేస్తున్నాడు. అతడికి శుక్రవారం వివాహం శుక్రవారం జరగాల్సి ఉండగా.. కుటుంబ సభ్యులు, బంధువుల ఆనందోత్సహాల మధ్య వరుణ్ని ఊరేగింపుగా స్థానిక శివాలయం వద్ద కళ్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు.
వివాహ తంతు మొదలై.. వధువు నుదుటన సమీర్ సింధూరం దిద్దాడు. పురోహితులు వధూవరులతో ఏడడుగులు వేయిస్తుండగా, సమీర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కుటుంబసభ్యులు వెంటనే అతడ్ని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతడ్ని పరీక్షించిన అక్కడ వైద్యుడు.. పరిస్థితి విషమంగా ఉందని మెరుగైన వైద్యం కోసం పెద్దాసుపత్రికి తరలించాలని సూచించారు. మరో ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యలో సమీర్ కన్నుమూశాడు. సమీర్ కార్డియాక్ అరెస్టుతో ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో ఆ కుటుంబం తీవ్ర శోకంలో మునిగిపోయింది.
వివాహం అనంతరం వధువు ఇంటి వద్ద సంగీత్ ఏర్పాటు చేశారు. అయితే, ఇంతలోనే విషాదం జరిగిపోయింది. సమీర్ హల్దవానీలోని మాట్రిక్స్ ఆస్పత్రిలో డెంటిస్ట్గా పనిచేస్తున్నాడు. తండ్రి కొన్నాళ్లు ఉపాధి కోసం ఒమన్లో వెళ్లి తిరిగొచ్చారు. ఇద్దరు సోదరిలు కాగా.. వీరిలో ఒకరికి వివాహం జరిగిందని బంధువులు తెలిపారు. గతంలో సమీర్కు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని పనిచేసే ఆస్పత్రి వైద్యుడు అన్నారు. చిన్నవయసులోనే గుండెపోటుకు గురికావడం చాలా బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa