వెంకటగిరి లో ఓ ఆర్ఎంపీ దారుణహత్యకు గురయ్యాడు. ఆయన్ను కొందరు దుండగులు కర్రలతో కొట్టి, కత్తులతో నరికి చంపేశారు. ఈ దుర్ఘటన వెంకటగిరి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. వెంకటగిరి మున్సిపాల్టీ 19వ వార్డు కౌన్సిలర్ మరిది, మాసాపేటకు చెందిన ఆర్ఎంపీ సందాని బాషా (46) డక్కిలి మండలం మోపూరులో క్లినిక్ నిర్వహిస్తున్నారు. రోజులాగే ఆదివారం రాత్రి క్లినిక్ని మూసేసి ద్విచక్ర వాహనంపై ఇంటికి బయల్దేరాడు. రాత్రి 10-10.30 గంటల సమయంలో రాపూరు- వెంకటగిరి మార్గం మిట్టపాళెం సమీపంలోని తెలుగుగంగ కాలువ వంతెన వద్దకొచ్చేసరికి గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై కర్రలతో దాడిచేసి, కత్తులతో నరికి చంపి పరారయ్యారు. ఈ సమయంలో ద్విచక్ర వాహనంపై అదే గ్రామంలో పంక్చరు షాపు నిర్వహిస్తున్న వెంకటగిరి పీర్జాతిపేటకు చెందిన యూసఫ్ కూడా ఉన్నట్లు సమాచారం. దాడి జరిగే సమయంలో అతను తప్పించుకుని పోలీసులకు వద్దకొచ్చి విషయం తెలిపాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. హత్యకు గల కారణాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa