ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితాల్లో అవకతవకలు జరిగాయి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 16, 2023, 01:16 PM

 ‘‘గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితాల్లో అవకతవకలు జరిగాయి. అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోంది’’ అని టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. బుధవారం అమరావతి సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) ముఖేశ్‌ కుమార్‌ మీనాను మాజీ మంత్రులు నక్కా ఆనంద్‌బాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, ఎమ్మెల్సీ అశోక్‌బాబు, పిల్లి మాణిక్యాలరావు, బుచ్చిరామ్‌ప్రసాద్‌, పారా కిశోర్‌ తదితరులు కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఎమ్మెల్సీ ఓటర్లను అధికార పార్టీ ప్రలోభపెట్టడంతో పాటు ఓట్లనే తారుమారు చేస్తోందని ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa