విశాఖకు చెందిన వ్యాపారవేత్త కాట్రగడ్డ లలితే్షకుమార్ స్థలం విషయంలో యధాతథస్థితి పాటించాలని ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించి రెవెన్యూ, పోలీసు అధికారులు బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దానిపై అత్యవసరంగా విచారణ జరపాలని ఆయన తరఫు న్యాయవాది వీవీ సతీష్ హైకోర్టును అభ్యర్థించారు. అయితే, దీనిపై అత్యవసర విచారణ అవసరం లేదని తమ ఉత్తర్వులను ఉల్లంఘిస్తుంటే కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం సూచించింది. ఆదేశాలను ఉల్లంఘిస్తే బాధ్యులైన అధికారులను జైలుకు పంపుతామని పేర్కొంది. విశాఖపట్నం, మర్రిపాలెంలోని సర్వే నెం.81/1, 81/3లో తనకు చట్టబద్ధంగా సంక్రమించిన 17,135 చదరపు మీటర్ల స్థలా న్ని రద్దు చేసేందుకు 2020 ఏప్రిల్ 23న ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 115ని కొట్టివేయాలని కోరుతూ లలితే్షకుమార్ 2020లో హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి సంబంధిత జీవోను రద్దు చేశారు. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రెవెన్యూ అర్బన్ల్యాండ్ సీలింగ్ ముఖ్యకార్యదర్శి, సీసీఎల్ఏ తదితరులు ధర్మాసనం ముందు అప్పీల్ వేశారు. ఈ నెల 14న విచారణ జరిపిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం యధాతథస్థితి పాటించాలని ఆదేశించింది. అయితే, ఈ ఉత్తర్వులను ఉల్లంఘించి స్థలం నుంచి ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa