మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో చంద్రబాబునాయుడు, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును సీబీఐ విచారించాలని గుడివాడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని డిమాండ్ చేశారు. చంద్రబాబు, ఏబీ వెంకటేశ్వరరావు సారథ్యంలోనే వివేకా హత్య జరిగిందని ఆరోపించారు. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అంత నిష్ట దరిద్రుడు ఎవరూ లేరని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు గురువారం కోడాలి నాని మీడియాతో మాట్లాడుతూ..
చంద్రబాబు మగాడైతే 2014 నుంచి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై సీబీఐ విచారణకు లేఖ రాయాలని కొడాలి నాని సవాల్ విసిరారు. పోలవరంలో చంద్రబాబు అవినీతి చేశారని ప్రధాని నరేంద్ర మోదీనే స్వయంగా చెప్పారన్నారు. చంద్రబాబు కంటే నిష్ట దరిద్రుడు ఎవరూ లేరన్నారు. చంద్రబాబు పరిపాలనంతా అరిష్టమే అన్నారు. బాబు సీఎంగా ఉన్నప్పుడు ఒక్క ప్రాజెక్ట్ అయినా నిండిందా అని ప్రశ్నించారు. కరువు, చంద్రబాబు కవల పిల్లలని ఎద్దేవా చేశారు.
అలాగే, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణిపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దిగజారి మాట్లాడుతున్నారని కొడాలి నాని దుయ్యబట్టారు. వ్యాపారాలు చేస్తున్న లోకేష్ భార్య, తల్లిని కూడా లోకేష్ సంబోధించినట్లుగానే పిలవాలా అని నిలదీశారు. లోకేష్ మైండ్ చెదిరిపోయి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa