తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండలం సురుటుపల్లి శ్రీపల్లికొండేశ్వర స్వామి ఆలయంలో పూల అలంకరణ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఆలయంలో ఫిబ్రవరి 10వ తేదీ నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 18వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా సురుటుపల్లి ఆలయాన్ని పలు రకాల పూలతో అలంకరణ చేస్తున్నారు. బెంగళూరు నుంచి వివిధ రకాల పూలను ప్రత్యేకంగా అలంకరణ కోసం తెప్పించారు. ఈ క్రమంలో శుక్రవారం ఆలయ చైర్మన్ ఏవీఎం బాలాజీ రెడ్డి ఆధ్వర్యంలో పూల అలంకరణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో దాదాపు 50 మంది మహిళలు బెంగళూరు నుంచి తెప్పించిన వివిధ రకాల పూలను మాలలుగా కడుతున్నారు. పూల అలంకరణ కోసం తిరుపతి దాతలు మునికృష్ణ, మునిదీక్షిత, గాయత్రి అవసరమైన సొమ్మును వెచ్చించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa