ఓట్ల కోసం రాష్ట్ర అభివృద్ధిని పాలకులు విస్మరించారని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. పొన్నూరు పట్టణంలోని జనసేన కార్యకర్త కుటుంబానికి గురువారం నాదెండ్ల మనోహర్ రూ. 5 లక్షల పరిహారాన్ని అందించారు. 31వ వార్డుకు చెందిన వల్లంశెట్టి సాయిభరత్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. సాయిభరత్ జనసేనలో క్రియాశీల కార్యకర్తగా వ్యవహరిస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. సాయిభరత్ మృతి వార్త తెలుసుకున్న జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఆదేశాలతో భరత్ కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షల పరిహారాన్ని నాదెండ్ల మనోహర్ అందించారు. ఈ సందర్భంగా భరత్ కుటుంబ సభ్యులను పరామర్శించి భరత్కు నివాళులర్పించారు. భరత్ను కోల్పోవడం తమ పార్టీకి తీరని నష్టమన్నారు. ప్రతి కార్యకర్త ఫిబ్రవరి 28లోగా జనసేన సభ్యత్వాలను పొందాలని సూచించారు. 175 నియోజకవర్గాల్లో జనసేన సభ్యత్వాన్ని పూర్తిచేసే లక్ష్యంతో ముందుకు సాగనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, బోనబోయిన శ్రీనివాస్యాదవ్, బోని పార్వతినాయుడు, పొన్నూరు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa