నిడదవోలు ఘోరం జరిగింది. స్నేహితుడి భార్యను కాపాడబోయి యువకుడు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు సీమీపంలో ఘటన జరిగింది. శెట్టిపేటకు చెందిన నరేంద్రకుమార్ ఓ ప్రైవేటు కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పని చేస్తున్నారు. అతడికి కొవ్వూరులో జావిద్ పాషా అనే స్నేహితుడు ఉన్నారు. ఈ క్రమంలో పాషాకు భార్య దేవితో గొడవ జరిగింది.. వీరికి సర్థి చెప్పేందుకు.. ఈ నెల 14న దంపుతుల్ని నరేంద్ర తన ఇంటికి తీసుకు వచ్చారు.
పాషా, అతడి భార్య 15న తెల్లారుజామున గొడవ పడ్డారు. ఆ వెంటనే దేవీ మనస్తాపంతో శెట్టిపేట పవర్ప్లాంట్ దగ్గర కాలువలో దూకేందుకు వెళ్లింది. అప్రమత్తమైన నరేంద్రకుమార్ పరుగున వెళ్లి ఆమెను రక్షించే ప్రయత్నం చేశారు. ఇంతలో అదుపుతప్పి కాలువలో జారి గల్లంతయ్యారు. అతడి మృతదేహం లభ్యమైంది.. మృతుడి తల్లి తులసి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. స్నేహితుడి భార్యను కాపాడబోయి నరేంద్ర ప్రాణాలు పోవడం తీవర్ విషాదాన్ని నింపింది. కుమారుడి మరణంతో తల్లి కన్నీళ్లు పెట్టుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa