తన పదవీ ముగియక ముందే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, మాజీ సీఎస్ సోమేశ్కుమార్ స్వచ్ఛంద విరమణ చేశారు. సోమేష్ కుమార్ వాలంటరీ రిటైర్మెంట్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆమోదించారు కూడా. తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్యదర్శిగా 2019 నుంచి బాధ్యతలు నిర్వహించిన సోమేశ్ కుమార్.. ఏపీ క్యాడర్కి చెందిన అధికారిగా తెలంగాణ హైకోర్టు నిర్ధారిస్తూ... ఇటీవలే తీర్పు వెలువరించింది. ఆయనను ఏపీకి బదిలీ చేస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో.. సోమేష్ కుమార్ జనవరి 12న ఏపీలో రిపోర్టు చేశారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ను కూడా కలిశారు. అయితే.. ఇంతా జరిగి దాదాపు నెల రోజులైనా.. సోమేశ్ కుమార్కు ఎలాంటి బాధ్యతలూ అప్పగించకపోవటం గమనార్హం. అందువల్లే.. సోమేష్ కుమార్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారని వార్తలు వస్తన్నాయి. ఇదిలా ఉంటే.. సోమేష్ కుమార్ పర్సనల్ రిక్వెస్ట్ మేరకే ఏ పదవి ఇవ్వలేదన్న వార్తలు కూడా వస్తున్నాయి.
సోమేష్ కుమార్.. తెలంగాణ సీఎస్గా, జీహెచ్ఎంసీ కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే.. సోమేశ్కుమార్ ఏపీ కేడర్కు చెందిన అధికారి అంటూ.. దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఆయనను ఏపీకి బదిలీ చేస్తూ తీర్పునిచ్చింది. దీంతో.. ఆయనను సీఎస్గా తొలగించి.. ఆమె స్థానంలో శాంతి కుమారిని నియమించింది తెలంగాణ సర్కారు. అయితే.. ఏపీకి వెళ్లటం ఎంత మాత్రం ఇష్టంలేని సోమేష్ కుమార్.. కోర్టు ఆదేశాల మేరకే అక్కడ రిపోర్ట్ చేశారు.
ఇదిలావుంటే ఏపీకి వెళ్లేందుకు ముందు నుంచి విముఖత చూపిస్తూ వస్తోన్న సోమేష్ కుమార్.. అక్కడికి వెళ్లటం కంటే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే ఆలోచన చేస్తున్నారంటూ వార్తలు దుమారం లేపాయి. అయితే.. సోమేశ్కుమార్ ఈ ఏడాది డిసెంబర్లో రిటైర్ అవబోతున్నారు. అయితే.. ఏపీలో రిపోర్ట్ చేసిన నెల రోజులకే వీఆర్ఎస్ తీసుకోవటం కొంత ఆసక్తికరంగా ఉన్నా.. ముందు నుంచి వస్తున్న వార్తలను నిజం చేశారు అంతే అన్న వాదన కూడా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa