నందమూరి తారకరత్న మరణంపై ఆయన అత్త ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి ఎమోషనల్ ట్వీట్ చేశారు. తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 'చక్కటి చిరునవ్వు.. అత్తా అనే పిలుపు.. నీ నుంచి ఇంకా వినకపోవచ్చు. కానీ.. నువ్వేప్పుడు మా హృదయంలో.. మదిలో.. స్మృతిలో చిరంజీవిగా ఉంటావు. లవ్ యూ తారక రత్న' అంటూ దగ్గుబాటి పురంధేశ్వరి ట్వీట్ చేశారు. అటు తారకరత్న పార్ధివదేహం వద్ద కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఆయన సతీమణి నారా బ్రహ్మణి నివాళుల్పించారు. తారకరత్న మృతితో తన యువగళం పాదయాత్రకు మూడు రోజుల పాటు తాత్కాలిక విరామం ప్రకటించిన నారా లోకేష్.. హైదరాబాద్ చేరుకొని తారకరత్న కుటుంబ సభ్యులను ఓదార్చారు.
'బావ అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ గొంతు ఇక నాకు వినిపించదు. నేనున్నానంటూ నా వెంట నడిచిన ఆ అడుగుల చప్పుడు ఆగిపోయింది. నందమూరి తారకరత్న మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగుదేశం యువతేజం తారకరత్న మృతి మా కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. నిష్కల్మషమైన నీ ప్రేమ, స్నేహ బంధం మన బంధుత్వం కంటే గొప్పది. తారకరత్నకి కన్నీటి నివాళి అర్పిస్తూ.. తారకరత్న పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను' అని లోకేష్ ట్వీట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa