ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈసీ చర్యలను వ్యతిరేకిస్తూ ఉద్దేవ్ ఠాక్రే సుప్రీంకోర్టులో పిటిషన్

national |  Suryaa Desk  | Published : Tue, Feb 21, 2023, 02:20 PM

పార్టీ గుర్తు చేజారడంపై మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదిలావుంటే ఏక్‌నాథ్ షిండే వర్గాన్ని అసలైన శివసేనగా గుర్తిస్తూ.. పార్టీ గుర్తు బాణం-విల్లును వారికి కేటాయిస్తూ ఎన్నికల కమిషన్ వెలువరించిన నిర్ణయాన్ని ఉద్ధవ్ వర్గం సుప్రీంకోర్టులో సోమవారం సవాల్ చేసింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం.. బుధవారం మధ్యాహ్నం విచారించనుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని రద్దు చేయాలని ఉద్ధవ్త తన పిటిషన్‌లో కోరారు. మరోవైపు, ఈసీ తమను అసలైన శివసేనగా గుర్తించడంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మొదటిసారి జాతీయ కార్యవర్గ సమావేశాన్ని మంగళవారం సాయంత్రం ఏర్పాటుచేసి, కొత్త నాయకులను నియమించే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.


మహారాష్ట్ర ముఖ్యమంత్రి వర్గం నేటి సమావేశం ముఖ్యమైనది, ఎందుకంటే ఉద్ధవ్ ఠాక్రే ఎదురు దాడులు.. మద్దతుదారులు, కార్యకర్తల విధేయతను పొందే ప్రయత్నాల మధ్య తన బలం, మద్దతును నిరూపించుకోవాల్సి ఉంది. ఠాక్రే, షిండేలు ఇద్దరూ పార్టీ కార్యకర్తల విధేయతను పొందేందుకు, పార్టీని ఏకీకృతం చేయడానికి ప్రయత్నిస్తున్నందున సేన పేరు, పార్టీ గుర్తు సమస్యకు సంబంధించి మరిన్ని ఆసక్తిక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.


సుప్రీంకోర్టులో పోరాటం కొనసాగుతున్న సమయంలో ‘శివ సైనిక్’ శిబిరాల్లో మరింత కార్యాచరణపై ఉద్ధవ్ దృష్టి సారించడం ద్వారా పార్టీ కార్యకర్తల నైతిక స్థైర్యాన్ని తనకు విధేయంగా ఉంచడానికి కృషి చేస్తున్నారు. మహారాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున్న క్యాంపులను కలిగిన ఉన్న శివసేన సమూహాలను ‘శివశక్తి అభియాన్’ లేదా పార్టీ కార్యకర్తలను బలోపేతం చేసేందుకు ఠాక్రే కసరత్తు ప్రారంభించారు. శనివారం ముంబైలోని శివసేన భవన్‌లో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు.


అయితే, ఇది జరిగి 24 గంటలు గడవక ముందే చట్టవిరుద్ధమైన రాజకీయ కార్యకలాపాలకు పబ్లిక్ ట్రస్ట్ కార్యాలయాన్ని ఎలా ఉపయోగిస్తారని, ఈ అంశంపై స్పష్టత కోసం శివసేన భవన్‌ను నిర్వహిస్తున్న శివాయ్ ట్రస్ట్ చీఫ్‌ను వివరణ కోరుతూ ఒక న్యాయ సంస్థ మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. అనేక దశాబ్దాలుగా రాజకీయ కార్యకలాపాల కోసం పబ్లిక్ ట్రస్ట్ కార్యాలయం ఎలా ఉపయోగిస్తున్నారు? అది ట్రస్ట్ లక్ష్యాలను ఉల్లంఘిస్తే ట్రస్టీలను ఎందుకు సస్పెండ్ చేయలేరు లేదా తొలగించలేరు..కొత్త నిర్వాహకుడిని ఎందుకు నియమించకూడదు?’’ యషాస్ లీగల్ అనే సంస్థ మహారాష్ట్ర లా అండ్ జ్యుడీషియరీకి రాసిన లేఖలో పేర్కొంది.


జూన్ 2022లో తనపై తిరుగుబాటు చేసిన వర్గంలోని 16 మంది సేన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ఠాక్రే గత ఏడాది చేసిన మరో అభ్యర్థనపై సుప్రీంకోర్టు ఇంకా తీర్పు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని అన్యాయమంటూ ఆయన సుప్రీం తలుపుతట్టారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa