ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముఖ్యమంత్రి తనపై చూపించిన ప్రేమాభిమానాలను ఎప్పటికీ మరిచిపోలేను

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 22, 2023, 04:25 PM

గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ కు గన్నవరం ఎయిర్‌పోర్టులో ప్రభుత్వం వీడ్కోలు పలికింది. బుధవారం ఉదయం గవర్నర్‌కు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆత్మీయ వీడ్కోలు పలికారు. బిశ్వభూషణ్‌ చత్తీ‌స్‌గఢ్‌ గవర్నర్‌గా బదిలీ అయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఆయనకు ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో గవర్నర్‌ ప్రసంగించారు. ముఖ్యమంత్రి తనపై చూపించిన ప్రేమాభిమానాలను ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పారు. రాష్ట్రాన్ని వీడుతున్నందుకు ఎంతోబాధగా ఉన్నప్పటికీ కేంద్రం తనకు మరో బాధ్యత అప్పగించిందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa