ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నరహంతక వైసీపీని గద్దె దింపితేనే ప్రజల ప్రాణాలు నిలుస్తాయీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 22, 2023, 04:27 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాక్షస పాలనకు మరో నెత్తుటి సాక్ష్యం, పల్నాడు జిల్లా, రొంపిచర్ల మండలం టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డి హత్య అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. బుధవారం ఉదయం తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి కోబాక విడిది కేంద్రం నుంచి యువగళం పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరహంతక వైసీపీని గద్దె దింపితేనే ప్రజల ప్రాణాలు నిలుస్తాయన్నారు. వైసీపీ గూండాల కాల్పుల్లో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన బాలకోటిరెడ్డి ఆత్మకి శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తూ.. ఆయన కుటుంబ సభ్యులకు తన సంతాపం తెలియజేస్తున్నానని లోకేష్ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa