ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భార్యపై, భర్త హత్యాయత్నం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 25, 2023, 03:09 PM

వివాహితపై అత్త, భర్త హత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఎన్టీఆర్ జిల్లా, మైలవరంలో జరిగింది.  ఆమెపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన భార్య మాధవి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. వివరాల్లోకి వెళితే... మైలవరం మండలంలోని గణపవరం గ్రామానికి చెందిన గుంజ మాధవి (25)పై భర్త శీను, అత్త సులోచన కలిసి కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేశారు. ఆమె నిద్రిస్తున్న సమయంలో 12 గంటలకు అత్త, భర్త కలిసి మాధవిని హతమర్చే ప్రయత్నం చేయగా ఆమె కేకలు విన్న ఇరుగు పొరుగువారు గమనించి దాడిని అడ్డుకున్నారు. అప్పటికే రక్తపు మడుగులో పడిఉన్న మాధవిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా భర్త శీను మైలవరం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం. పూర్తి సమాచారం అందవలసి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa