ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజాం అమ్మవారి పండగల్లో ఖరీదైన వినోదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 27, 2023, 12:38 PM

రాజాం పోలిపల్లి పైడితల్లి అమ్మవారి ఆలయం వద్ద సుమారు మూడు ఎకరాల విస్తీర్ణంలో ప్రతి ఏటా అమ్మవారి జాతరకు అయ్యప్ప రెడ్డి అను ఓ ప్రైవేటు వ్యక్తికి ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు అండతో ఇక్కడ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఏటా ఈ డీల్ కొనసాగింపు పై అనేక విమర్శలు ఉన్నప్పటికీ ఒకే వ్యక్తికి ప్రతి ఏటా ఎగ్జిబిషన్ నిర్వహించేందుకు మోగ్గు చూపుతున్నారు. దీంతో ఆలయానికి రావలసిన ఆదాయంపై గండి పడుతుంది. ఎగ్జిబిషన్ పుణ్యమా అని భారీ మైకులతో సౌండ్ పొల్యూషన్ సృష్టిస్తున్నారు. ప్రస్తుతం పదవ తరగతి పరీక్ష రాసే విద్యార్థులకు ఈ శబ్దాలతో చదువుకునేందుకు ఆటంకం కలుగుతుంది. ఇక ఎగ్జిబిషన్ చూసేందుకు వచ్చే సందర్శకులకు గత ఏడాది కంటే ఈ ఏడాది టిక్కెట్ ధర అమంతంగా పెంచేయడంతో జేబుకు చిల్లులు పడటం ఖాయం అనే చెప్పాలి. టికెట్ ధరలపై సందర్శకులు కూడా మండిపడుతున్నారు. లోపల దొరికే ఆహార పదార్థాలు పరిస్థితి మరి దారుణం. నిల్వ ఉంచిన సరుకులను వేడి చేసి దుమ్ముధూలితో కలిపి విక్రయిస్తున్నారు. వినోదం మాట అటుంచి లోపలికి వెళ్తే పర్సు మాత్రం ఖాళీ అవడం ఖాయం అని పలువురు వాపోతున్నారు. మొత్తానికి రాజాము అమ్మవారి పండగలో వినోదం మరి ఖరీదైపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa