శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్, చేజర్ల ఇంద్రాణి ట్రస్ట్ చైర్మన్ కింగ్ ఇంద్ర సంయుక్త ఆధ్వర్యంలో ఏప్రిల్ 9, 10 తేదీల్లో ప్రపంచ తెలుగు సాహితీ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని సంస్థ మీడియా ప్రతినిధి అమ్మోజీ బమ్మిడి తెలిపారు. సోమవారం శ్రీకాకుళం లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో నిర్విరామంగా 48 గంటలు సాగే కళా ప్రదర్సనల్లో అందరూ భాగస్వామ్యం కావాలని కోరారు. పాల్గొన్న కళాకారులందరికీ ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పిస్తామని తెలిపారు. పలు ప్రపంచ రికార్డుల్లో నమోదవుతున్న కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఘనంగా సత్కరిస్తామని తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే కళాకారుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైందన్నారు. రిజిస్ట్రేషన్ పూర్తిగా ఉచితం అని తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న దలచిన వారు 82475 19925 మొబైల్ నెంబర్ కి వాట్సప్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని సూచించారు. ప్రోగ్రాం మీడియా ప్రతినిధిగా అమ్మోజీని, ప్రోగ్రాం కన్వీనర్ గా గుత్తా హరి సర్వోత్తమ నాయుడు, ఆర్గనైజర్ గా కొల్లి రమావతి ని నియమిస్తూ చైర్మన్ కత్తిమండ ప్రతాప్ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. టెక్కలి మండలం పోలవరం గ్రామానికి చెందిన అమ్మోజి రణస్థలం మండలంలో మహిళా పోలీసుగా విధులు నిర్వర్తిస్తున్నారు.
చైర్మన్ కత్తిమండ ప్రతాప్ ఆధ్వర్యంలో అంతర్వేది లో 32 గంటల పాటు కళాకారుల ప్రదర్సన చేశామన్నారు. తాడేపల్లిగూడెం లో జాతీయ కన్వీనర్ కొల్లి రమావతి ఆధ్వర్యంలో 24 గంటలు నిరవధికంగా ప్రపంచ కవితోత్సవం, తెలంగాణా రాష్ట్రం మంచిర్యాలలో 24 గంటల పాటు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు కట్ల భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో కళా ప్రదర్సనలు ఏర్పాటు చేసి పలు ప్రపంచ రికార్డుల్లో చోటు సంపాదించామన్నారు. ప్రస్తుతం వీటన్నింటినీ బ్రేక్ చేసేలా 48 గంటలు నిర్విరామంగా కళా ప్రదర్శనలు, పుస్తక ఆవిష్కరణలు, ప్రపంచ కవితోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa