మనం ఒకటి తలిచితే విధిరాత మరోలా జీవితాలను మార్చేస్తుంది. స్పేహితులు ఫ్రెండ్ బర్త్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్గా చేసుకున్నారు.. అందరూ సరదాగా గడిపారు. నిద్ర పట్టడం లేదని అలా సరదాగా షికారుకు బయల్దేరారు. ఇంతలోనే ఊహించని ప్రమాదం వారిని వెంటాడింది.. ముగ్గురి ప్రాణాలు కోల్పోయారు. కుప్పం పీఈఎస్ మెడికల్ కాలేజీలో ఓ విద్యార్థి ఎంబీబీఎస్ చదువుతున్నాడు. అతడి పుట్టినరోజు వేడుకలకు అతని పెద్దమ్మ కుమారుడు.. మదనపల్లె మిట్స్ కళాశాల విద్యార్థి కల్యాణ్, పీఈఎస్లో ఎంబీబీఎస్ ఫైనలియర్ విద్యార్థి శ్రీవికాస్రెడ్డి, థర్డ్ ఇయర్ విద్యార్థి తలారి ప్రవీణ్, పలువురు స్నేహితులు, విద్యార్థులు వేడుకలు చేసుకున్నారు.
పీఈఎస్ ఎదురుగా ప్రవీణ్ ఉంటున్న రూమ్లో వేడుకలు జరిగాయి. శుక్ర, శనివారాల్లో బాగా ఎంజాయ్ చేశారు. శనివారం అర్ధరాత్రి సెలబ్రేషన్స్ జరిగాగాయి. ఆ తర్వాత విద్యార్థుల్లో కొందరు ఆ రూమ్లోనే నిద్రపోయారు. అయితే ఎంతకీ నిద్ర పట్టకపోవడంతో అలా తిరిగొద్దామని శ్రీవికాస్రెడ్డి.. తలారి ప్రవీణ్తో పాటు వెంకటసాయి కల్యాణ్ను వెంటబెట్టుకొని కారులో బయల్దేరారు. ఆదివారం తెల్లవారుజామున బయల్దేరిన కొద్ది నిమిషాలకే రోడ్డు ప్రమాదం జరిగింది.
చిన్నశెట్టిపల్లె సమీపంలో ముందు వెళ్తున్న లారీని కారు ఢీకొట్టడంతో పక్కకు పడడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్ధులు సంఘటనా స్ధలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురి మరణంతో ఆ కుటుంబాలు తీవ్ర విషాదంలో ఉన్నాయి. ముగ్గురు చదువుకుంటున్న విద్యార్థులు కావడంతో తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa