ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రీతి, అక్షర మరణాల వెనుక ఉన్న వాస్తవాలను బయటపెట్టాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 01, 2023, 02:55 PM

 ప్రీతి,  అక్షర మరణాల వెనుక ఉన్న వాస్తవాలను బయటపెట్టాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. మంగళవారం గిరిజన సమాఖ్య ఆధ్వర్యం లో  కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రీతి, అక్షర మరణాలకు కారణమైన వారిని శిక్షించాలన్నారు. ప్రిన్సిపాల్‌, హెచ్‌వోడీ ప్రీతి మరణానికి బాధ్యత వహించాలన్నారు. వాళ్లిద్దరినీ అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బంజారా సంఘం జాతీయ నాయకులు శంకర్‌ నాయక్‌, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ రాష్ట్ర సహాయ కార్యదర్శి టీ. ఈశ్వర్‌, చైతన్య మహిళా సంఘం కన్వీనర్‌ ఝాన్సీరాణి, పౌరహక్కుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రెడ్డెయ్య, గిరిజన సమాఖ్య నాయకులు విశ్వనాథనాయక్‌, సీఐటీయూ నాయకురాలు సావిత్రి తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa