ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే సీఎం జగన్ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని టీడీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ విమర్శించారు. పొందూరులో టీడీపీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ 2019 ఎన్నికలకు ముందు వివేకానందరెడ్డి హత్యను చంద్రబాబునాయుడు, టీడీపీ నాయకులపై రుద్ది ప్రజల్లో సానుభూతి పొందారని ఆరోపించారు. తన సొంత పత్రికలో వివేకానందరెడ్డి హత్యపై నారాసుర రక్తచరిత్ర అని రాయించి సానుభూతితో ఓట్లు వేయించుకున్నారన్నారు. వాస్తవానికి సానుభూతి కోసం బాబాయిని జగన్మోహన్ రెడ్డే హత్య చేయించారని ప్రస్తుతం సీబీఐ విచారణతో తేలుతోందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గ ఇన్చార్జి బండారు సత్యానందం మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రక్తంలోనే హత్యారాజకీయాలు ఉన్నాయని విమర్శిం చారు. వివేకానంద హత్యపై వాస్తవాలు ప్రజలకు తెలియాలనే తమ పార్టీ జగనాసుర రక్త చరిత్ర పుస్తకం ముద్రించిందని చెప్పారు. అనంతరం జగనాసుర రక్తచరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్యెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బలపరిచిన చిరంజీవిరావును గెలిపించి వైసీపీ ప్రభుత్వానికి బుద్ధిచెప్పాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa