వ్యక్తిగతంగా రాజధాని అమరావతికే తన మద్దతు ఉంటుందని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మరోసారి స్పష్టంచేశారు. ఇదిలావుంటే రాష్ట్ర రాజధానిపై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని, త్వరలోనే విశాఖపట్నం కేంద్రంగా పరిపాలన ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తేల్చిచెబుతున్నారు. మూడు రాజధానులకే తమ మద్దతు ఉంటుందని వైసీపీ నేతలు సైతం చెబుతున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ జిల్లా మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ మాత్రం వ్యక్తిగతంగా రాజధాని అమరావతికే మద్దతు ఇచ్చానని వెల్లడించారు. కానీ, మూడు రాజధానులపై ప్రభుత్వ విధానానికి తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.
ఇదిలావుంటే ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కవులూరులో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికుడైన తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జువ్వా రాంబాబు అమరావతి రాజధానిపై శాసనసభ్యుడిగా మీరెందుకు స్పందించడం లేదని ఆయనను ప్రశ్నించారు. రాజధానిపై అయోమయం నెలకొనడంతో తమ భూముల ధరలన్నీ తగ్గిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ఎవరు బాధ్యులని రాంబాబు ప్రశ్నించారు. దీంతో వ్యక్తిగతంగా రాజధాని అమరావతికే తన మద్దతు ఉంటుందని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సమాధానమిచ్చారు.
ఇదిలావుంటే అమరావతి, మూడు రాజధానులపై ఇప్పటికే విస్తృతంగా చర్చ జరుగుతోంది. కేసుల నుంచి బయటపడి ఎప్పుడెప్పుడు విశాఖపట్నం నుంచి పరిపాలన చేద్దామా అని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది. గతంలో కూడా రాజధాని అంశంపై వసంత కృష్ణప్రసాద్ ఇదే మాదిరిగా కామెంట్స్ చేశారు. అప్పుడు కూడా ఆయన వ్యక్తిగతంగా అమరావతేకే జై కొట్టారు. దీనిపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరగటంతో తర్వాత ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటామని తెలిపారు. సీఎం జగన్ నిర్ణయం మేరకు నడుచుకుంటానని అన్నారు. తాజాగా, వసంత కృష్ణప్రసాద్ రాజధానిపై చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa