ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖలో నాలుగు కొత్త బీచ్‌లు ఏర్పాటు,,,కసరత్తు ప్రారంభించిన సర్కార్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 02, 2023, 07:25 PM

విశాఖ నగరాన్ని మరింత అందంగా తీర్చిదిద్దడానికి ఏపీ సర్కార్ సిద్దమవుతోంది. విశాఖపట్నంలో అంతర్జాతీయ సదస్సుల నేపథ్యంలో.. జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త బీచ్‌ల కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నాలుగు కొత్త బీచ్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. సాగర్ నగర్, జోడుగుళ్ల పాలెం, మంగమారిపేట, తొట్లకొండలో బీచ్‌లను అభివృద్ధి చేస్తున్నారు. దీనికి సంబంధించిన పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. మంత్రి ఆదిమూలపు సురేష్ సహా.. కీలక అధికారులు ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నారు.


సముద్ర తీరంలో.. 25 కిలో మీటర్ల స్ట్రెచ్‌లో కొత్త బీచ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. పనుల పురోగతిని మంత్రి ఆదిమూలపు సురేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 'గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఇక్కడ సీఎం జగన్‌, కొంత మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు విడిది చేయనున్నారు. ఇప్పటికే 12 వేల మంది వరకు రిజిస్టర్ చేసుకున్నారు. దీంతో సిటీలో బ్యూటిఫికేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. రోడ్ల మరమ్మత్తులు, ఎలక్ట్రికల్ పనులు పూర్తయ్యాయి' అని మంత్రి ఆదిమూలపు సురేష్ వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa