గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖపట్నంకు బయల్దేరారు. విశాఖలో శుక్రవారం, శనివారాల్లో జరగనున్న ఈ సదస్సులో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం సీఎం జగన్ విశాఖకు పయనం అయ్యారు. రాత్రికి విశాఖ నగరంలో సీఎం జగన్ బస చేస్తారు.
ఈ నెల 3వ తేదీన ఉదయం 9.10 గంటలకు సీఎం జగన్ ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్కు చేరుకుని గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో పాల్గొంటారు. రాత్రి 8.00 - 9.00 గంటల సమయంలో ఎంజీఎం పార్క్ హోటల్లో జీఐఎస్ డెలిగేట్స్కు ఏర్పాటు చేసిన ప్రత్యేక విందు కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం రాత్రి బస చేయనున్నారు.
అలాగే, ఈ నెల 4న ఉదయం 9.10 గంటలకు ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్కు చేరుకుని రెండో రోజు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో సీఎం జగన్ పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు విశాఖ నుంచి బయల్దేరి మధ్యాహ్నం 3.40 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
మరోవైపు విశాఖపట్నంలో నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సుకు వచ్చే అతిథులకు ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. కేంద్ర మంత్రులు, పారిశ్రామిక దిగ్గజాల కోసం ఏపీ ప్రభుత్వం హెలికాప్టర్లు, లగ్జరీ కార్లను ఏర్పాటు చేస్తోంది. వీవీఐపీలు, వీఐపీల కోసం నగరంలోని ప్రముఖ హోటళ్లలో దాదాపు 800 గదులని సిద్ధం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa