టీడీపీలో విషాధం నెలకొంది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఇటీవలే గుండెకు ఆపరేషన్ చేయించుకున్నారు. ఈ క్రమంలో గురువారం అర్జునుడు తీవ్ర అస్వస్థతకు గురై కన్నుమూశారు. ఆయన మరణం పట్ల టీడీపీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ Bachula Arjunudu గత కొన్ని రోజుల అనారోగ్యం బాధపడుతూ.. విజయవాడలోని ఒక ప్రవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతు తుది శ్వాస విడిచారు.
బచ్చుల అర్జునుడు 1957 జులై 4న కృష్ణా జిల్లా మచిలీపట్టణంలో.. సుబ్బయ్య- అచ్చమ్మ దంపతులకు జన్మించారు. బి.ఏ వరకు చదువుకున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి 2017లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. బచ్చుల అర్జునుడు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి.. 1995 నుంచి 2000 వరకు ప్రైమరీ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడిగా పని చేశారు. 2000 నుంచి 2005 వరకు మచిలీపట్టణం మున్సిపాలిటీ ఛైర్మన్గా పని చేశారు.
2014లో కృష్ణా జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2017లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో.. శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2020 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కమిటీ క్షమశిక్షణా కమిటీ చైర్మన్గా నియమితులయ్యారు. ఇటీవల గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. టీడీపీకి దూరం జరగ్గా.. ఆయన గన్నవరం బాధ్యతలు తీసుకున్నారు. ఆ బాధ్యతలు తీసుకున్న కొన్ని రోజులకే.. ఆయన ఆసుపత్రి పాలయ్యారు. అర్జునుడు మృతితో టీడీపీలో విషాదం నెలకొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa