నెల్లూరు జిల్లా, కావలి ముసునూరులోని వికలాంగుల కాలనీలో ఆక్రమణలు తొలగించాలని కోరుతూ దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి మండవ వెంకట్రావు శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సహచర దివ్యాంగులు అడ్డుకున్నారు. వికలాంగులకాలనీలో అధికారపార్టీ అండదండలతో కొందరు ఆక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని వెంకట్రావు రూరల్ పోలీసులకు, తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. వారు విచారణ జరిపినా చర్యలు తీసుకోకపోవటంతో ఆక్రమణలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. దీంతో ఆయన తహసీల్దార్ కార్యాలయానికి మూడు చక్రాల వాహనంలో వచ్చి కొంతసేపు ఆందోళన చేశారు. ఎవరూ పట్టించుకోక పోవటంతో తనతో తెచ్చుకున్న పెట్రోల్ను తలపై పోసుకున్నాడు. జేబులో అగ్గిపెట్టె తీసి వెలిగించే ప్రయత్నం చేయబోగా, సహచర దివ్యాంగులు అడ్డుకున్నారు. అనంతరం రెండో పట్టణ, రూరల్ ఎస్ఐలు ఆయన్ను తహసీల్దార్ కార్యాలయంలోకి తీసుకెళ్లి చర్చించారు. ఆ సమయంలో తన కార్యాలయం ముందు న్యూసెన్స్ సృష్టించినందుకు కేసు పెడతామని తహసీల్దార్ బెదిరించినట్లు మాట్లాడారు. దాన్ని వెంకట్రావు ప్రతిఘటిస్తూ వికలాంగుల కాలనీలో ఎవరైనా సకలాగులు ఆక్రమిస్తే దివ్యాంగుల చట్టప్రకారం వారిపై కేసులు పెట్టాలి. కాని తనపై కేసులు పెడతామంటే భయపడేది లేదన్నారు.. తర్వాత కొంతసేపటికి తహసీల్దార్ కార్యాలయానికి డీఎస్పీ ఎం. వెంకటరమణ వచ్చి జరిగిన సంఘటనపై విచారించారు. అక్కడ ఆక్రమణలకు గురౌతున్న ప్లాట్ల్లు ఎవరివో తగిన ఆధారాలు చూపేవరకు ఎవరిని నిర్మాణాలు జరపకుండా నిరోధిస్తామని తహసీల్దార్ చెప్పారు. దీంతో వెంకట్రావు ఆందోళనను విరమించుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa