పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి కోరారు. సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, చెముడుగుంటలోని శ్రిడ్స్ కళ్యాణ మండపంలో సర్వేపల్లి నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి తో కలిసి రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేతలందరూ కలిసికట్టుగా ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సమయం తక్కువగా ఉందని, సర్వేపల్లి నియోజకవర్గంలోని 5 మండలాల కన్వీనర్లు వారి వారి మండలాలలోని సచివాలయ కన్వీనర్లు, గృహ సారధులతో ఆయా పంచాయతీలలోని నాయకుల పర్యవేక్షణలో ప్రతి ఒక్క ఓటరు నేరుగా మూడుసార్లు కలిసి ఓటును అభ్యర్థించాలని సూచించారు. 2014, 2019 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సర్వేపల్లి నియోజకవర్గంలో తన గెలుపు కోసం శ్యామ్ కష్టపడి పనిచేసి, నా విజయంలో కీలక భూమిక పోషించాడని తెలిపారు. పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డిని గెలిపించాల్సిన బాధ్యత మీ అందరితో పాటుగా తనకు ఉందని, నేను కూడా ఈ వారం రోజులు పాటు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa