ఢిల్లీలోని విజయ్ పార్క్లో బుధవారం మధ్యాహ్నం నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిందని ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారి తెలిపారు.ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వారు తెలిపారు.డిఎఫ్ఎస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ మాట్లాడుతూ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఇక్కడ సాయిబాబా ఆలయానికి సమీపంలోని విజయ్ పార్క్ ప్రాంతంలో భవనం కూలినట్లు కాల్ వచ్చిందని తెలిపారు. నాలుగు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని శిథిలాలను తొలగిస్తున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa