బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం ద్వారపూడి శివారు వేములపల్లి దూకుడు మెట్ట వద్ద ఘోరం జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే పాతగొడవల నేపథ్యంలో రాజానగరం మండలం తుంగపాడుకు చెందిన కట్టుంగ హరీష్, మరోవ్యక్తి మంగళవారం అర్ధరాత్రి మద్యం సేవించి అదే గ్రామానికి చెందిన బండి ఈశ్వరరావు ట(శివ)(42)పై దాడికి దిగారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని అపస్మారక స్థితిలో ఉన్న శివను 108లో రాజ మహేంద్రవరం తరలించారు. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడని మండపేట రూరల్ ఎస్ఐ శివకృష్ణ తెలిపారు. రాజా నగరంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో శివ బస్డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ సంఘటనపై మండపేట సీఐ పెద్దిరెడ్డి శివగణేష్ సారథ్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. సంఘటనా స్థలాన్ని రామచంద్రపురం డీఎస్పీ బాల చంద్రారెడ్డి పరిశీలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa