ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూడు ఫ్లేవర్లతో మార్కెట్లోకి రిలయన్స్ సాఫ్ట్‌ డ్రింక్స్‌

national |  Suryaa Desk  | Published : Thu, Mar 09, 2023, 08:53 PM

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మళ్లీ సాఫ్ట్‌ డ్రింక్స్‌ బ్రాండ్‌ కాంపాను ప్రారంభించారు. రిలయన్స్  బ్రాండ్ కాంపాను మార్కెట్లోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (ఆర్‌సిపిఎల్) శీతల పానీయాల బ్రాండ్ కాంపాను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది మూడు ఫ్లేవర్లలో లభ్యం కానుంది. కాంపా కోలా, కాంపా ఆరెంజ్, కాంపా లెమన్ ఫ్లేవర్లలో ఈ డ్రింక్స్‌ అందుబాటులో ఉంటాయని రిలయన్స్ ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. 200 ఎంఎల్ బాటిళ్ల ధర రూ.10గా నిర్ణయించారు. 500 ఎంఎల్ బాటిల్ ధర రూ.20 నిర్ణయించారు. ముందుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచే వీటి విక్రయాలు ప్రారంభిస్తున్నట్లు రిలయన్స్‌ తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa