ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వింత శిశువు జననం... పుట్టిన 20 నిమిషాలకే చనిపోయిన ఘటన

national |  Suryaa Desk  | Published : Thu, Mar 09, 2023, 11:20 PM

వింత శిశువు జన్మించి కేవలం 20 నిమిషాల్లో చనిపోయిన ఘటన చోటు చేసుకొంది. నాలుగు కాళ్లు, నాలుగు చేతులు, రెండు గుండెలతో శిశువు జన్మించిన ఘటన రాజస్థాన్‌లోని చురూ జిల్లాలో చోటుచేసుకుంది. రతన్‌గఢ్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో 19 ఏళ్ల గర్భిణి రెండు గుండెలు.. నాలుగు చేతులు, నాలుగు కాళ్లు ఉన్న చిన్నారికి జన్మనిచ్చింది. అయితే, పుట్టిన 20 నిమిషాలకే నవజాత శిశువు చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. రాజల్దేసార్‌కు చెందిన హజారీ సింగ్‌ అనే మహిళ ప్రసవ వేదనతో ఆదివారం రాత్రి రతన్‌గఢ్‌లోని గంగారామ్‌ ఆసుపత్రిలో చేరింది. ఆమెకు సోనోగ్రఫీ నిర్వహించగా అందులో వింత శిశువు కనిపించిందని వైద్యులు పేర్కొన్నారు.


‘‘నవజాత శిశువుకు నాలుగు చేతులు, నాలుగు కాళ్లు ఉన్నాయి. అలాగే రెండు గుండెలు, వెన్నెముకలు ఉన్నాయి. పుట్టిన కొన్ని నిమిషాల తర్వాత ఆ శిశువు ప్రాణాలు కోల్పోయింది. ప్రస్తుతం మహిళ ఆరోగ్యంగానే ఉంది’’ అని ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ కైలాస్ సొంగరా పేర్కొన్నారు. తమ ఆస్పత్రికి రాత్రి 8.30 గంటలకు పురిటి నొప్పులతో వచ్చిందని, అడ్మిట్ అయిన అర గంటలోనే బిడ్డను ప్రసవించిందని వివరించారు. ఆమెకు సాధారణ ప్రసవం జరిగిందని చెప్పారు. ఈ రకంగా జన్మించడాన్ని కంజుక్టివల్ అనోమలీ అంటారని, ఇది క్రోమోజోమ్‌లో లోపం వల్ల కావచ్చని వైద్యులు అభిప్రాయపడ్డారు.


అయితే, హోలీ పండగ ముందు ఈ వింత శిశువు జన్మించడంతో ఆ ప్రాంతంలో పలు రకాలుగా ఊహించుకుంటున్నారు. ఇది దైవలీల అని చుట్టుపక్కల జనం భావించడం గమనార్హం. గతేడాది డిసెంబరులో మధ్యప్రదేశ్‌లో ఇలాంటి వింత ఘటన వెలుగులోకి వచ్చింది. గ్వాలియర్ జిల్లాలో ఓ పాప నాలుగు కాళ్లతో పుట్టింది. అయితే ఈ బిడ్డ పూర్తి ఆరోగ్యవంతంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శిశువు పిండం రెండు భాగాలుగా విభజితమై, శరీరంలో రెండు ప్రదేశాల్లో అభివృద్ధి చెందుతుంది. నడుము కింద రెండు అదనపు కాళ్లతో అభివృద్ధి చెందడాన్ని ఇస్కియోపాగస్ అంటారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa